🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 10 Aug, 2026 | Page: 1

పోలీస్ ఏఆర్‌ఎస్‌ఐ గుండెపోటుతో మృతి

వరంగల్ కమిషరేట్ ఆర్మూర్ రిజర్వ్ విభాగంలో ఏఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎస్. శామ్యూల్ (57) ఈ రోజు ఉదయం సమయంలో హనుమకొండలోని ప్రకాశ్ రెడ్డి పేట జంక్షన్ వద్ద గల తన నివాసంలో ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు.
విధులకు హాజరయ్యేందుకు బయలుదేరుతున్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
1989న పోలీస్ శాఖలో విధుల్లో చేరిన శామ్యూల్ సుమారు 37 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో సేవలందించారు.
ఆయన మృతి పట్ల పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపిఎస్
తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.
🏠 Home