🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 11 Aug, 2026 | Page: 1

టాస్క్‌ఫోర్స్ దాడి.. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

రంగల్‌ నగరంలోని మట్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా అక్రమంగా ఐఎంఎఫ్‌ఎల్ మద్యం విక్రయిస్తున్న మహిళను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ బృందం ఆటోనగర్‌లోని బెల్ట్‌షాప్‌పై దాడి నిర్వహించింది. ఈ దాడిలో అక్రమంగా విక్రయిస్తున్న వివిధ రకాల ఐఎంఎఫ్‌ఎల్ మద్యం, బీర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ మొత్తం రూ.3,930గా పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న మద్యం:
ఓసీ 90 ఎంఎల్ – 18 బాటిళ్లు
డౌన్‌టౌన్ 180 ఎంఎల్ – 4 బాటిళ్లు
ఐబీ 90 ఎంఎల్ – 3 బాటిళ్లు
ఐబీ 180 ఎంఎల్ – 1 బాటిల్
ఎంసీ 180 ఎంఎల్ – 1 బాటిల్
రాయల్ స్టాగ్ 90 ఎంఎల్ – 4 బాటిళ్లు
ఎంసీ 90 ఎంఎల్ – 4 బాటిళ్లు
8PM 90 ఎంఎల్ – 1 బాటిల్
కేఎఫ్ స్ట్రాంగ్ బీర్ – 1 బాటిల్
ఈ కేసులో *సంగినేని జయమ్మ (62)*ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె తుమ్మలకుంట, ఆటోనగర్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. నిందితురాలిని, స్వాధీనం చేసుకున్న మద్యం స్టాక్‌ను తదుపరి చట్టపరమైన చర్యల కోసం మట్వాడ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు.
ఈ దాడిలో ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ బి. రాజు, ఆర్‌ఎస్‌ఐ ఓ. భానుప్రకాష్తో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home