చేవెళ్ల నియోజకవర్గం శివగళ్ల శ్రీనివాస్ ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ లో చేరిక
ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కొత్తపేట రాష్ట్ర కార్యాలయంలో గురువారం రోజున రాష్ట్ర కన్వీనర్ రాయబండి పాండురంగం గారు చేవెళ్ల నియోజకవర్గం శివగళ్ల శ్రీనివాస్ గారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పాండురంగ మాట్లాడుతూ ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిల్ని ఏర్పాటు చేయడానికి ప్రతి బాధ్యులు ఒక్కరు కృషి చేయాలని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధపడాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని పార్టీ ఏ బాధ్యత ఇచ్చిన కూడా తప్పకుండా నిర్వర్తించి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పార్టీని ముందు నడపడానికి ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు వేమన శ్యాంప్రసాద్ కే వెంకటస్వామి మోత్కూరి మల్లా చారి బిఎల్పి రాష్ట్ర నాయకులు మారోజు సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.