🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 18 Aug, 2026 | Page: 1

పూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ పద్మశాలి చేనేత కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణకార్యక్రమంలో పాల్గొన్న

హైదరాబాదులోని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన పూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ మార్త రమేష్ గారు పద్మశాలి చేనేత కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ మరియు బీసీ సంఘం నాయకులు దాసు సురేష్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా మార్త రమేష్ గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం బీసీల పట్ల తనకున్న నిబద్ధతను పూలే దంపతుల విగ్రహల స్థాపన చేసి నిరూపించుకున్నారని, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని, ఇదే స్ఫూర్తితో బీసీలకు అన్ని రంగాలలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
🏠 Home