ప్రిన్సిపల్ రూప రెడ్డి హత్యకు నిరసనగా TRASMA ప్రకటించిన బందుకు సహకరించని ప్రైవేట్ స్కూల్
నల్లగొండ జిల్లాలో ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్యకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రైవేట్ టీచర్ రికగ్నైజ్డ్ అసోసియేషన్ నేడు బందుకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు యాదగిరి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ ఈ బందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని పాఠశాలలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. కానీ చౌటుప్పల్ మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాల మాత్రం దీనిని లెక్కచేయకుండా విద్యార్థులను పాఠశాలకు రప్పించింది. విషయం తెలిసి జన చరిత్ర న్యూస్ పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎట్టకేలకు చివరికి పాఠశాలకు సెలవు ప్రకటించి విద్యార్థులను ఇంటికి పంపించడం జరిగింది.