చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ శివారులో దారుణ హత్యకు గురైన యువకుడు
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ శివారులో దారుణ హత్య కలకలం రేపింది.
అంకిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన యువకుడు దానయ్య(30) పంతంగి గ్రామ శివారులో గల శనిగల గుట్ట వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు స్థానికంగా కూలీ పని చేసేవాడని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అంకిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన యువకుడు దానయ్య(30) పంతంగి గ్రామ శివారులో గల శనిగల గుట్ట వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు స్థానికంగా కూలీ పని చేసేవాడని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.