🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 24 Aug, 2026 | Page: 1

నల్గొండలో విషాదం.. ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి!

నల్గొండ: మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా దేవరకొండ రోడ్డులో గంగ వారి గూడెం వెళ్లే రోడ్డు వద్ద ఫ్లెక్సీ కడుతుండగా విషాద ఘటన చోటుచేసుకుంది...ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విద్యుత్ తీగలకు తగలడంతో రాజు అనే వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఫ్లెక్సీని తొలగించి, విద్యుత్ సరఫరాను నిలిపివేసేందుకు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🏠 Home