వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి
మంగళవారం సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా అధికారులు మరియు గ్రామప్రజలతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.