🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 26 Aug, 2026 | Page: 1

మోత్కూర్: ప్రాజెక్టుల నిధుల కోసం సిపిఎం పాదయాత్ర

మోత్కూర్: ఆగస్టు 26 (జనచరిత్రన్యూస్): సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29, 30, 31 తేదీల్లో భువనగిరి నుంచి ఇందిరాపార్క్ వరకు సిపిఎం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు తెలిపారు. పాలడుగు రాగిబావి గ్రామాల్లో గోడపత్రికలు ఆవిష్కరించారు. భునాదిగాని కాల్వను పూర్తి చేసి తాగునీరు అందించాలని కోరారు. 31న ఇందిరాపార్కులో జరిగే మహాధర్నాకు రైతులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
🏠 Home