🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 03 Sep, 2026 | Page: 1

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎస్ ఐ ఆర్ కార్యక్రమం పెట్టి ప్రతి ఓటర్ ద్వారా వివరాలను సేకరించి మళ్లీ నోటీసులు

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎస్ ఐ ఆర్ కార్యక్రమం పెట్టి ప్రతి ఓటర్ ద్వారా వివరాలను సేకరించి మళ్లీ నోటీసులు పంపి సరి చేసుకోవాలని ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని 40 డివిజన్ బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు ఉర్సు ప్రతాప్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడినారు గత 40 సంవత్సరం నుండి ఓటు వేసిన వారికి గత పది సంవత్సరాల క్రితం నుండి ఓట్లు వేస్తున్న వారికి ఈ రోజు సహాయ ఎన్నికల నమోదు అధికారి వాంకుడోత్ ప్రశాంత్ పేరు మీద బి ఎల్ వో లు నోటీసులు ఓటర్లకు ఇవ్వడం వలన ఓటర్లు అందరూ కేంద్రాల వద్దకు పరుగు తీస్తున్నారన్నారు గడువులోపు ఓటేరే స్వయంగా రావాలని బిఎల్వోలు తెలుపుతున్నారని నోటీసులు ఎందుకు ఇస్తున్నారని అడిగితే సరియైన విషయములు చెప్పలేకపోతున్నారన్నారు ఇప్పటికైనా ఓటరుకు నోటీసులు ఎందుకు ఇచ్చారనే విషయం బిఎల్వోలు తెలియపరచాలని దూరప్రాంతాలలో ఉన్న వారి వివరములు వారి కుటుంబ సభ్యులు అందజేయుటకు అధికారులు అవకాశం కల్పించాలని మరుపల్ల రవి ప్రభుత్వాన్ని కోరినారు ఇట్టి సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వనం కుమార్ చీర రమేష్ కళ్యాణపు వెంకటేశ్వర్లు గోనె మధు కుండే సదానందం నరిగే సదానందం లు ఉన్నారు
🏠 Home