🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 08 Sep, 2026 | Page: 1

40వ డివిజన్లోని చెట్లోళ్ల గడ్డ వద్ద బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి అధ్యక్షతన సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ శాసనసభలో అడగడానికి వెళ్తున్న శాసనసభ్యులను మహిళా శాసనసభ్యులను గాయపరిచి అవమాన పరచడం సరైన విధానం కాదని రాష్ట్ర సరోగకి బోర్డు మెంబర్ బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ హరి రమాదేవి అన్నారు మంగళవారం రోజున 40వ డివిజన్లోని చెట్లోళ్ల గడ్డ వద్ద బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడినారు అధికారంలోకి రావడానికి అనేక హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు పరచకుండా అడిగేవారి ని అడగకుండా నిర్బంధం విధిస్తూ పోలీసులు అరెస్టులు చేయిస్తున్నారని ఆమె అన్నారు
మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సాధ్యం కానీ హామీలు ప్రకటించి 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు పరచకపోవడం వలన ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఎప్పుడు పోతుందోనని ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు హామీలు నెరవేర్చాలని అసెంబ్లీలో అడగడానికి వెళ్తున్న శాసనసభ్యులను పోలీసులచే అడ్డగింపజేసి వారి ని గాయపరిచి మహిళా శాసన సభ్యులను అవమానపరచి వారు గొంతు నొక్కడానికి రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుపరచకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు
బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మసూద్ మాట్లాడుతూ రేవంత్ సర్కార్ కక్షపూర్వకంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు మహిళా శాసనసభ్యులను అవమాన పరచడం యావత్ తెలంగాణ ప్రాంత ప్రజలకు జరిగిన సంఘటనగా భావించవలసి వస్తుంది అని అన్నారు

మాజీ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం సుల్తానా మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎవరైనా అడిగితే అట్టి వారిపై కేసులు అరెస్టులు చేయిస్తున్నారని నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం మట్టిలో కలిసిపోయిందని ఆమె అన్నారు ధర్నాలో పాల్గొన్న సభ్యులందరూ రేవంత్ రెడ్డి పాలన పోవాలి కెసిఆర్ సర్కారు రావాలి నిరంకుశ పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గద్దె దిగాలని రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇట్టి ధర్నా కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్ మరుపల్ల భాగ్యలక్ష్మి మర్రి శ్రీనివాస్ పోలేపాక రాజన్ బాబు మరుపల్ల గౌతం అంకం దేవానంద్ గోనె మధు గుల్ల పెళ్లి కర్ణ అస్మా ఎలుగల మానస ఈగ అరుణ ఆవునురి చిన్న సునీత కట కం ప్రియాంక చెల్పూరి మంజుల పేర్న రవి వెంగళ రాజనర్సు నరిగే సదానందం కుండె సదానందం క్యాతం రాజేందర్ లుఉన్నారు
🏠 Home