దళిత బస్తీలో నిర్వహించినటువంటి సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేసిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్‌లో జన్ను సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో దళిత బస్తీలో నిర్వహించిన సహపంక్తి భోజన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు పాల్గొని స్థానికులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, రాష్ట్ర నాయకులు త్రిలోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరి శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు రఘునా రెడ్డి, మండల అధ్యక్షులు విప్ప సుధాకర్ స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.