ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతం వేడుకలు

గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ,శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతం వేడుకలు అర్చకులు తిరుమల పురుషోత్తమ చారి , భాస్కరాచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ పాడిపంటలు సమృద్ధిగా పండాలని స్వామి వారి కృప అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.అనంతరం మహిళలు వ్రతం శ్లోకం ఆరాధించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని, ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జన్ను దివ్యభారతి,కమిటీ నిర్వాహకులు, ఉపాధ్యాయులు,మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.