మోత్కూర్: సూచిక బోర్డులు లేక.... ప్రమాద భయం

మోత్కూరు నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై పనకబండి నుంచి రాజన్న గూడెం వరకు రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. పలుచోట్ల డైవర్షన్లు ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళ ప్రమాద ముప్పు పొంచి ఉంది. డైవర్షన్ల వద్ద హెచ్చరిక బోర్డులు రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేసి వాహనాదారులను అప్రమత్తం చేయాలని స్థానికులు కోరుతున్నారు.