జీవో నెంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు-పర్వతగిరి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి , ఆగష్టు 22 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలని, విద్యార్థి వ్యతిరేక విధానాలను విడనాడాలని, పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడడం పర్వతగిరి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పేరుతో సాంకేతిక విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి ఎస్బిటెట్ వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో తీసుకు వస్తున్న విధానాల ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ఐటిఐ- ఏ టి సి లతో అనుసంధానం చేయడం ద్వారా...