మోత్కూర్: బీసీ మండల్ ఆశయ సాధనకు కృషి

మోత్కూరులో బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందెశ్వరి ప్రసాద్ మండల్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ మండల్ జయంతి సందర్భంగా శ్రీకాంత్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీల అభ్యున్నతికి మండల్ చేసిన సేవలు చిరస్మరాణిమన్నారు.