గృహప్రవేశ వేడుకకు హాజరై ఆఫీసుద్దీన్–షబాన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
జన చరిత్ర పర్వతగిరి ఆగష్టు 26 : పర్వతగిరి గ్రామానికి చెందిన ఆఫీసుద్దీన్–షబాన దంపతులు మంచిర్యాల పట్టణంలోని రామకృష్ణాపూర్లో నూతనంగా నిర్మించుకున్న గృహంలో బుధవారం గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్వతగిరి సొసైటీ వైస్ చైర్మన్ సందెల నవీన్, పర్వతగిరి మాజీ సర్పంచ్ గోనె సంపత్, బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు శంషుద్దీన్, ధారం రాంచందర్ గుప్తా, కానిస్టేబుల్ ఇస్లావత్ రాజేందర్ తదితరులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో వారు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.