నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రంగు కుమార్ మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి, ఆగష్టు 30 : పర్వతగిరి మండల కేంద్రానికీ చెందిన ఆరుమూరి చి.శ్రీకాంత్ - చి. ల. సౌ.వెంకట నాగ అఖిల ల కళ్యాణ మహోత్సవానికి పర్వతగిరి లోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో ఆదివారం మాజీ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రంగు కుమార్ , మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినారు. ఈ కార్యక్రమం లో సిరివెల్ల మనోహర్, డుండి హరీష్, బైరి రాజశేఖర్, పుల్లా శివారెడ్డి, రావుల రాజు, పబ్బోజు ప్రశాంత్ పాల్గోన్నారు.