​14,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్

​నల్గొండ జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ (DSP) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ​ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రూ. 14,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది విద్యార్థులు, ముఖ్యంగా బిసి, ఎస్సీ, ఎస్టీ మరియు పేద వర్గాలకు చెందిన విద్యార్థులు కళాశాలల్లో తమ చదువులను కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ​ఫీజు బకాయిల ఆలస్యం కారణంగా విద్యార్థుల చదువులకు ఆటంకం కలగడమే కాకుండా, దాదాపు...