మోత్కూర్: అర్చకుని పిల్లల చదువుకు 1. 50 లక్షల సాయం
మోత్కూర్ వెంకటేశ్వర ఆలయం అర్చకుడు వెంకటరమణచార్యుల పిల్లల చదువుకు ఆలయ నిర్మాణదాత ఏగుమటి రాంరెడ్డి రూ 1.50 లక్షల ఆర్థిక సాయం అందించారు. పిల్లల పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు. దీంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాంరెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముప్ప వెంకటరెడ్డి, గుండు మల్లేశం, దామర సోమనారాయణ తదితరులు పాల్గొన్నారు.