నూతన వధూవరులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు - పాదూరి శ్రీనివాస్ రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ గోదా కృష్ణారెడ్డి ఆశీస్సులు

మిర్యాలగూడలో జరిగిన వివాహ వేడుకలో తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాదూరి శ్రీనివాస్ రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ గోదా కృష్ణారెడ్డి లతో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. మామిడాల గ్రామానికి చెందిన అప్పాల శ్రీనివాస్–రమాదేవి దంపతుల కుమారుడు శ్రీధర్, నిహారికల వివాహానికి హాజరైన ఆయన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ తిప్పర్తి డైరెక్టర్ గోదా కృష్ణారెడ్డి, మామిడాల మాజీ సర్పంచ్ నాగరాణి అంబేద్కర్, వార్డు సభ్యులు కందుల సైదులు, విశ్వనాధుల పుల్లయ్య, నెల్లికంటి యాదగిరితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.