గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల సూచన
వరంగల్: నగరంలోని గణేష్ మండపాల నిర్వాహకులు తమ మండపాలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని మట్వాడ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సూచించారు.గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలు,ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ సూచించిన భద్రతా,ట్రాఫిక్ నిబంధనలను ప్రతి మండపం నిర్వాహకుడు పాటించాలని కోరారు.మండపాల వివరాలను "తెలంగాణ పోలీస్ ఆన్లైన్ పోర్టల్లో"(https:policeportal.tspolice.gov.in/index.htm)నమోదు చేసుకోవాలని తెలిపారు.ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.మరిన్ని వివరాలు,సందేహాల కోసం మట్వాడ పోలీస్ స్టేషన్ను 8712685005 నంబర్లో సంప్రదించాలని సూచించారు.