EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Aug 2026, 06:13 PM | TELANGANA, వరంగల్
    తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

    *జన చరిత్ర న్యూస్ వరంగల్ :
    వాసవి భవన్, శాంతి నగర్, రైల్వే గేట్, వరంగల్ లో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ వారి ఆధ్వర్యంలో యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి సహకారంతో " జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా " తేదీ :- 30/08/2026 ఆదివారం రోజున తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా వచ్చిన రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు శిరుప అనిల్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు యాద రవికుమార్ గార్లు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు శిరుప అనిల్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాలి . లేదంటే వారు చనిపోయే ప్రమాదం ఉంది, ఈ కార్యక్రమంలో రక్తదానం చేసి విజయవంతం చేసిన రక్తదాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో 51 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గార్లపాటి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి గార్లపాటి నాగేందర్ కోశాధికారి గందె శ్రీనివాస్, యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు
    కొత్తకొండ అరుణ్ కుమార్, బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు), పోలీస్ కానిస్టేబుల్ బొట్టు కమలాకర్, రక్తదాతలు :- వైనాల రమేష్, వేణు, శంకర్ గోపాల్, రమేష్, విజయ్ కుమార్ వినయ్, సంతోష్, అశోక్, సదాశివుడు, మూర్తి, నాగేశ్వరరావు, విక్రమ్, రంజిత్, రవి, శ్రీనివాస్, సతీష్, అనిల్, సునీల్, సంతోష్, నిఖిల్, శ్రావణ్, రాజేష్, గజ్జెల సుమన్, ఉప్పరపల్లి రాజ్ కుమార్, ఊరటి రవికుమార్ అలువల పృథ్వి, మునిగాల రాంప్రసాద్, ఎస్.కె ముస్తఫా మరియు రక్తదాతలు పాల్గొనడం జరిగింది.

    తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం - Additional Image