EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • NCERT మార్పులు – దేశ ప్రయోజనాలు

    Author
    Posted By JANA CHARITRA
    | 31 Aug 2026, 09:35 AM | NATIONAL, TELANGANA
    NCERT మార్పులు – దేశ ప్రయోజనాలు

    జాతీయ విద్యా విధానం (NEP), ఎన్సీఈఆర్‌టీ పుస్తకాల నూతన మార్పులు భారత విద్యావ్యవస్థ చరిత్రలో అత్యంత విప్లవాత్మకమైనవి. కేవలం మార్కులు, ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి పెంచుతూ, వలస కాలపు మెకాలే విద్యా విధానానికి ఇది చరమగీతం పాడుతోంది. నూతన సంస్కరణలు సిలబస్ క్రమబద్ధీకరణ ద్వారా ఒత్తిడి లేని అభ్యాసానికి తెరలేపాయి. సంకుచిత రాజకీయ స్వార్థంతో, పాత ఆలోచనలతో ఈ మార్పులపై నెగటివ్ ప్రచారం చేసే వారికి.. ఈ విద్యా విధానం సాధించబోయే అద్భుతమైన దేశ ప్రయోజనాలే చెంపపెట్టులాంటి సమాధానం.

    ఈ నూతన విద్యా విధానంలో మాతృభాషకు, మన నిజమైన దేశ చరిత్రకు అగ్రతాంబూలం ఇచ్చారు. “ఇంగ్లీష్ మీడియం చదవకపోతే పిల్లలు వెనుకబడిపోతారు” అనే నెగటివ్ ప్రచారాల అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తూ, ఐదో తరగతి వరకు మాతృభాషలోనే పూర్తి విద్యాబోధన తప్పనిసరి చేశారు. ప్రపంచంలోని అత్యంత ఆర్థిక వ్యవస్థలు గల జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు సొంత భాషల్లోనే చదివి అగ్రరాజ్యాలుగా ఎదిగాయి. మాతృభాషలో చదవడం వల్ల పిల్లల మెదడు వేగంగా స్పందించి, సబ్జెక్టులపై స్పష్టమైన అవగాహన పెరుగుతుందని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. గతంలో ఒక వర్గానికే పరిమితమైన చరిత్ర పాఠాలను మార్చి.. అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, ఈశాన్య భారత వీరుల నిజమైన దేశభక్తి గాథలను చేర్చారు. ఇది నేటి తరం పిల్లల్లో “మన దేశం గొప్పది” అనే ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది.

    వివిధ దశలలో ప్రవేశపెట్టిన నూతన అంశాల వివరణ

    ఇవి కూడా చదవండి

    ఫౌండేషనల్ స్టేజ్ (నర్సరీ-2వ తరగతి): పిల్లలపై పరీక్షల ఒత్తిడి లేకుండా ‘నో-ఎగ్జామ్ పాలసీ’ అమలు చేస్తున్నారు. పుస్తకాల బరువు తగ్గించి ఆటలు, పాటల ఆధారిత సిలబస్‌ను ప్రవేశపెట్టారు. మాతృభాషలోనే బోధన సాగుతూ, అంకెలు, అక్షరాల గుర్తింపు పెంపొందించేందుకు ‘ఫౌండేషనల్ లిటరసీ కార్యక్రమాలను చేర్చారు.
    ప్రిపరేటరీ స్టేజ్ (3-5వ తరగతి): కథల రూపంలో భాషా నైపుణ్యాలు నేర్పించేలా ఇంగ్లీష్ పుస్తకం పూర్వి’, హిందీ పుస్తకం మల్హార్ ను ప్రవేశపెట్టారు. సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులను ప్రయోగాల ఆధారంగా, నిజజీవిత కథలతో ముడిపెడుతూ లాజికల్ థింకింగ్‌ను పెంచేలా మార్చారు. పర్యావరణ స్పృహ, స్థానిక సంస్కృతి అంశాలను చేర్చారు.

    మిడిల్ స్టేజ్ (6-8వ తరగతి): విప్లవాత్మకమైన ‘వృత్తి విద్యా శిక్షణ’, కంప్యూటర్ కోడింగ్‌ను ప్రవేశపెట్టారు. కార్పోరేటరీ, గార్డెనింగ్ లాంటి ప్రాక్టకల్ నైపుణ్యాల కోసం ఏడాదిలో 10 రోజులు పుస్తకాలు లేని ‘బ్యాగ్‌లెస్ డేస్’ విధానాన్ని తెచ్చారు. సోషల్ సైన్స్ కోసం ఎక్స్ ప్లోరింగ్ సొసైటీ అనే పుస్తకాన్ని తెచ్చి భారత ప్రాచీన విజ్ఞానాన్ని చేర్చారు.
    సెకండరీ స్టేజ్ (9-12వ తరగతి): పాత గ్రూపుల విభజనను తొలగించి, విద్యార్థులు నచ్చిన సబ్జెక్టులను కలిపి ఎంచుకునే మల్టీడిసిప్లినరీ విధానాన్ని తెచ్చారు. మ్యాథ్స్ లో బేసిక్, అడ్వాన్స్‌డ్ అనే రెండు స్థాయిల పరీక్షలు తెచ్చారు. మూడు భాషల విధానాన్ని తప్పనిసరి చేస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలతో సిలబస్‌ను రూపొందించారు. తాజాగా ఎమర్జెన్సీ పాఠ్యాంశాన్ని చేర్చారు.

    దేశ ప్రయోజనాలే పరమావధిగా రూపుదిద్దుకున్న ఈ విధానం, భారతదేశాన్ని ‘విశ్వగురువు’గా మార్చడానికి బలమైన పునాది వేసింది. పాత చదువుల వల్ల డిగ్రీలు ఉన్నా ఉద్యగ నైపుణ్యాలు లేని పరిస్థితి ఉండేది. నేటి ఎన్సీఈఆర్‌టీ విధానంలో స్కూల్ స్థాయి నుంచే కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వృత్తి విద్యా కోర్సులను అనుసంధానించారు. దీనివల్ల చదువు పూర్తి కాగానే యువత ఉద్యోగాల కోసం దేవులాడే స్థితి నుండి.. ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. సైన్స్ విద్యార్థి హిస్టరీని, కామర్స్ విద్యార్థి ఫ్యాషన్ డిజైనింగ్‌ను చదువుకునేలా సబ్జెక్టుల ఎంపికలో పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం దీని ప్రత్యేకత. సరికొత్త 5+3+3+4 విద్యా నిర్మాణంతో భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత నాలెడ్జ్ సూపర్ పవర్‌గా మార్చేందుకు ఈ సంస్కరణలు ఎంతగానో దోహదపడతాయి.