EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాశిబుగ్గ ముదిరాజ్‌వాడలో ఘనంగా పోచమ్మ బోనాలు

    Author
    Posted By JANA CHARITRA
    | 02 Sep 2026, 06:34 PM | TELANGANA, తాజా వార్తలు, వరంగల్
    కాశిబుగ్గ ముదిరాజ్‌వాడలో ఘనంగా పోచమ్మ బోనాలు

    ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య BRS మాజీ ఎమ్మెల్యే నన్నపనేని Narender బీఆర్‌ఎస్ కాంటెస్టెడ్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి బీజేపీ నాయకులు ప్రదీప్ రావు
    వరంగల్: కాశిబుగ్గ ముదిరాజ్‌వాడలో పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. స్థానిక మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ముదిరాజ్‌వాడలో పండుగ వాతావరణం నెలకొంది.
    ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి లుగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాల పండుగలో పాల్గొన్న భక్తులు, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
    బోనాల సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.
    ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు భయా స్వామి, బిళ్ళ శివ బిళ్ళ వెంకటేష్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు భేతి అశోక్ బాబు, గోరంట్ల మనోహర్, గుండేటి నరేంద్ర కుమార్ గోరంటల రాజు మంతన అమ్రేశ్ నల్గొండ రమేష్ రవి రంజిత్ పవణ్ Brs కాంగ్రెస్ Bjp పద్మశాలి కుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు.
    పోచమ్మ బోనాల సందర్భంగా కాశిబుగ్గ ముదిరాజ్‌వాడలో భక్తి సందడి నెలకొంది. సంప్రదాయాలు, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా వేడుకలు కన్నుల పండుగగా సాగాయి.